యాప్నగరం

ఆస్తి కోసం ఘాతుకం.. అత్తమామలను గొంతు నులిమి చంపేసిన కోడలు

ఆస్తి కోసం అత్తమామలనే దారుణంగా చంపేసిందో మహిళ. ఈ ఘటన సౌత్ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో జరిగింది. పోలీసులు భార్యభర్తలను విచారిస్తున్నారు.

Samayam Telugu 24 Apr 2020, 3:57 pm
ఆస్తి కోసం ఓ మహిళ అత్తమామలనే కడతేర్చిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. దక్షిణ ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో రాజ్‌సింగ్(61), ఓమ్‌వతి(58) అనే వృద్ధ దంపతులు కొడుకు సతీశ్ సింగ్, కోడలు కవిత, ఇద్దరు మనవళ్లతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి రాజ్‌సింగ్, ఓమ్‌వతి హత్యకు గురైనట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఓ గదిలో వారిద్దరు విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu Image


Also Read: వ్యాపారంలో నష్టం.. ఆర్థిక సమస్యలతో మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య

వారిద్దరి గొంతుపై గాయాలు ఉండటంతో నులిమి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. కోడలు కవిత తీరు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆరా తీయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. కవిత కొన్నాళ్లుగా వేరే కాపురం పెట్టాలని చూస్తోందని, ఆస్తి రాసివ్వాలని అత్తమామలను కోరుతోందని తెలిసింది. అయితే వేరు కాపురానికి అత్తమామలు ఒప్పుకోకపోవడంతోనే ఆమె ఈ కిరాతకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనలో సతీశ్ హస్తం ఉందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో భార్యభర్తలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

Also Read: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్.. మైనర్ బాలికపై నలుగురు కామాంధులు పశువుల్లా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.