యాప్నగరం

‘దిశ’ నిందితుడి ఇంట్లో విషాదం.. రోడ్డుప్రమాదంలో చెన్నకేశవులు తండ్రి..

దిశ హత్యకేసులో ఏ4 నిందితుడైన చెన్నకేశవుల తండ్రి కురుమయ్య గురువారం రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. జక్లేర్ గ్రామంలో బైక్‌పై వెళ్తున్న ఆయన్ని ఇన్నోవా వాహనం ఢీకొని వెళ్లిపోయింది.

Samayam Telugu 27 Dec 2019, 8:41 am
‘దిశ’ హత్యకేసులో నిందితుడిగా ఉండి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చెన్నకేశవుల తండ్రి కురుమయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. నారాయణ్ పేట్ జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో బైక్‌పై వెళ్తున్న కురుమయ్యను ఇన్నోవా వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఆయన్ని స్థానికులు వెంటనే మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Samayam Telugu pjimage (11)


Also Read: కిడ్నాప్ చేసి ఏడాదిన్నరగా 11మంది గ్యాంగ్ రేప్.. బిడ్డకు జన్మనిచ్చినా వదలని కామాంధులు

అక్కడి వైద్యులు కురుమయ్యకు ప్రథమ చికిత్స అందించారు. ఆయన కుడికాలు విరిగిపోయిందని వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఈ ఘటనపై వివరాలు సేకరించారు. అదే సమయంలో కురుమయ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయన్ని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

Also Read: అల్లుడితో అత్త రొమాన్స్.. ఇద్దరినీ మంచంపై చూసి షాకిచ్చిన భర్త

దిశ హత్యకేసు నిందితుల్లో ఏ1 నిందితుడైన ఆరిఫ్ స్వగ్రామమే జక్లేర్. మిగిలిన నిందితులైన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు స్వగ్రామం గుడిగుండ్ల. ఇప్పుడు చెన్నకేశవుల తండ్రి కురుమయ్య జక్లేర్ గ్రామంలోనే రోడ్డుప్రమాదానికి గురికావడంతో ఆ ప్రాంతం మరోసారి వార్తల్లోకి వచ్చింది. గురువారం వ్యక్తిగత పని నిమిత్తం బైక్‌పై జక్లేర్‌కు వెళ్లిన కురుమయ్య తిరిగి గుడిగుండ్లకు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మక్తల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కాకినాడలో చేతబడి కలకలం.. మహిళ ఇంటిని ధ్వంసం చేసిన స్థానికులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.