యాప్నగరం

సైకియాట్రిస్ట్‌కి డిప్రెషన్.! బిల్డింగ్‌ పైనుంచి దూకి..

యువ మానసిక వైద్యుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయన ఎయిమ్స్‌ హాస్టల్ బిల్డింగ్‌ పదో అంతస్తు నుంచి కిందకు దూకేసి సూసైడ్ చేసుకున్నారు.

Samayam Telugu 10 Jul 2020, 9:45 pm
మానసికంగా కుంగిపోయిన ఓ యువ సైకియాట్రిస్ట్ అర్ధాంతరంగా తనువు చాలించాడు. బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో సైకియాట్రీ విభాగంలో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న అనురాగ్ కుమార్(25) హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకేసి సూసైడ్ చేసుకున్నాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎయిమ్స్ హాస్టల్ పదో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
depression


తీవ్రగాయాలపాలైన అనురాగ్‌ను ఎమర్జెన్సీ వార్డుకి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. డిప్రెషన్ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. డిప్రెషన్‌కి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. చనిపోయే ముందు తన సెల్‌ఫోన్‌ను బిల్డింగ్ పైన వదిలేసినట్లు గుర్తించిన పోలీసులు.. దాని ఆధారంగా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read: భర్తకి 20 కత్తిపోట్లు.. దోపిడీ దొంగలని కారుతో గుద్దేసిన భార్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.