యాప్నగరం

భార్యని తిట్టాడని.. బాస్‌ని పొడిచేసిన డ్రైవర్

డ్రైవర్ సోమాకి ఫోన్ చేసి మేనేజర్ ప్రశాంత్ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సోమా భార్యతో మేనేజర్ అసభ్యకరంగా మాట్లాడడంతో ఆగ్రహం చెందిన సోమా..

Samayam Telugu 20 Aug 2020, 6:40 pm
భార్యని తిట్టాడని మేనేజర్‌ని పొడిచి చంపేసిన దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పనిలో ఇద్దరి మధ్య ఏర్పడిన చిన్న వివాదం చినికిచినికి హత్యకు దారితీసింది. నగరంలోని లగ్గెరె ఏరియాకి చెందిన ప్రశాంత్(29) ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్న సోమశేఖర్ అలియాస్ సోమాతో పని విషయమై గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన ప్రశాంత్ డ్రైవర్‌ సోమాకి ఫోన్ చేసి వాగ్వాదానికి దిగాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


సోమా భార్య ఫోన్ తీయడంతో ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు. ఆమెను అవమానపరిచేలా తిట్టడంతో విషయం భర్త సోమాకి చెప్పింది. ఆగ్రహంతో రగిలిపోయిన సోమా ఆర్‌ఎంసీ యార్డు పరిధిలోని ఆఫీసుకెళ్లి మేనేజర్‌తో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మరోమారు ఘర్షణ జరగడంతో ఆవేశంలో మేనేజర్ ప్రశాంత్‌ని పొడిచేశాడు. కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ప్రశాంత్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read:
నడిరోడ్డుపై మహిళ ప్రైవేట్ పార్ట్స్‌ పట్టుకున్న పోకిరీ.. చెంప పగలగొట్టి..Read Also: డలిపై కన్నేసిన కీచక మామ.. కోరిక తీర్చమంటూ.. కామారెడ్డిలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.