యాప్నగరం

పీకల్దాకా తాగి పైత్యం.. నడిరోడ్డుపై బైక్‌ తగలబెట్టి హల్‌చల్

మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మద్యం దొరకడంతో పీకల్దాకా తాగి కొందరు మందుబాబులు పైత్యం ప్రదర్శిస్తున్నారు.

Samayam Telugu 8 May 2020, 7:14 pm
లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబుల చిత్రవిచిత్రాలు చూడాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న బైక్‌కి అడ్డువచ్చిందన్న కోపంతో మందుబాబు.. విషసర్పాన్ని కసకస కొరికి చంపేశాడు. పళ్లతో పాము శరీరాన్ని పీకేశాడు. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఆ దారుణ ఘటన మరువక ముందే మరో మందుబాబు నడిరోడ్డుపై బైక్ తగలబెట్టి కలకలం సృష్టించాడు. ఈ ఘటన కూడా కర్ణాటకలోనే జరగడం విశేషం.
Samayam Telugu బైక్ తగలబెడుతున్న మందుబాబు


నలభై రోజుల తర్వాత మద్యం షాపులు తెరవడంతో ఫుల్లుగా మందుతాగిన యువకుడు బైక్‌ని తగలబెట్టిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. సూర్యనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేకల్ వద్ద నడిరోడ్డుపై బైక్ పడేసి నిప్పంటించాడు. అందరూ చూస్తుండగానే మందుబాబు నిప్పు పెట్టి మంటలను వేడుకగా చూస్తూ నిల్చున్నాడు.

Also Read: ‘నా భర్త కరోనాతో పోయాడు..’ భార్య దొంగేడుపు.. పక్కింటోళ్లకి అనుమానం రావడంతో..

అటుగా వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యపోయి చూస్తున్నా.. ఏమీ పట్టనట్టుగా యువకుడు అక్కడే నిలబడిపోయాడు. బైక్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ఇండియన్ రాబిన్‌ హుడ్ ఇక లేరు.. పెద్దలను కొట్టి.. పేదలకు పంచేసిన బందిపోటు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.