యాప్నగరం

ప్రేమ పేరిట నయవంచన.. యువతి బలవన్మరణం

ప్రేమ, పెళ్లి పేరిట మోసపోయానని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని సుంకటరేవులో ఈ సంఘటన జరిగింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 21 Dec 2019, 3:12 pm
ప్రేమ, పెళ్లి పేరిట వంచనకు గురయ్యానని మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని సుంకటరేవులో ఈ సంఘటన చోటుచేసుకుంది. కొత్తూరుకు చెందిన అరదాడి శేఖర్‌ అనే వ్యక్తి యానాం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ నేపథ్యంలో భార్యా, భర్తలమని చెప్పి సుంకటరేవులో గది అద్దెకు తీసుకుని తరుచూ కలుస్తుండే వారు.
Samayam Telugu death


Also Read: ప్రేమ పేరుతో డబ్బు మొత్తం వాడుకుని.. చివరకు మరో యువతితో..

ఈ క్రమంలో వివాహం చేసుకోమని ఆమె శేఖర్‌పై ఒత్తిడి తీసుకురాగా, అప్పటికే అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నట్లు తెలిసింది. దీంతో ప్రేమ, పెళ్లి పేరిట శేఖర్ మోసం చేశాడని మనస్తాపానికి గురైన యువతి అద్దెకు తీసుకున్న గదిలోనే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతదేహాన్ని యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.