యాప్నగరం

అల్లుడిపై కోపంతో అత్త దారుణం.. రెండేళ్ల చిన్నారిని చితకబాది..

మూడేళ్ల కిందట కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. అది ఆమె తల్లికి ఎంతమాత్రం ఇష్టం లేదు. దీంతో అల్లుడిని అవమానపరిచేది. నా కూతురికి సరిపోవంటూ సూటిపోటి మాటలు..

Samayam Telugu 30 Aug 2020, 8:26 pm
కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో అల్లుడిపై కోపం పెంచుకున్న అత్త దారుణానికి ఒడిగట్టింది. తండ్రి మీద కోపంతో అభంశుభం తెలియని చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది. కర్రతో రెండేళ్ల మనవడిని చితకబాదింది. అమ్మమ్మ దెబ్బలు తాళలేక చిన్నారి కేకలు పెట్టడంతో స్థానికులు వచ్చి అడ్డుకుని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harassment


నగరంలో గురప్పనపాళ్య ఏరియా మైకో లే ఔట్‌కి చెందిన ముబీనా తాజ్(65) కూతురు మూడేళ్ల కిందట అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కూతురి ప్రేమ వివాహం తల్లికి నచ్చకపోవడంతో అల్లుడిపై అక్కసు పెంచుకుంది. నిత్యం కూతురి భర్తను తూలనాడేది. తన కూతురికి సరిపోవంటూ అవమానాలకు గురిచేసేది. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి.

Also Read: భర్తను చంపి బెడ్రూమ్‌లో కుక్కిన భార్య.. ఘాతుకం

అదే విషయమై మరోమారు గొడవ జరగడంతో అల్లుడిపై ఆగ్రహం చెందిన అత్త అమానుషంగా వ్యవహరించింది. రెండేళ్ల మనవడిని దారుణంగా కొట్టింది. కర్రతో విచక్షణా రహితంగా చితకబాదడంతో చిన్నారి కేకలు విని స్థానికులు అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

Read Also:
కడపలో దారుణం.. మైనర్ బాలికపై వీఆర్‌ఏ అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.