యాప్నగరం

అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆగిపోయిన కారు.. కిందకు దిగిన వ్యక్తి దుర్మరణం

కారు నడిరోడ్డుపై ఆగిపోవడంతో లక్ష్మణ్ సింగ్ కిందకు దిగి చూసేలోపే మృత్యువు దూసుకొచ్చింది. ఇంటికి వెళ్దామనుకుని బయల్దేరి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.

Samayam Telugu 31 Mar 2020, 8:26 pm
లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్నేహితులతో కలసి కారులో స్వగ్రామానికి బయల్దేరిన యువకుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని జలోర్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ సింగ్ బైదరహల్లిలో నివాసం ఉంటూ స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో సొంతూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
Samayam Telugu car


అతని స్నేహితులు జగ్మల్ సింగ్, జితేంద్ర, కిమ్ సింగ్‌లతో కలసి కారులో రాజస్థాన్ బయల్దేరాడు. కొద్దిదూరం వెళ్లాక కారు రిపేర్ వచ్చి బెంగళూరు తుమకూరు రోడ్డులో నీలమంగళ వద్ద ఆగిపోయింది. సడెన్‌గా కారు మరమ్మతులకు గురవడంతో లక్ష్మణ్ సింగ్ కిందకు దిగి రిపేర్ చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అటువైపుగా దూసుకొచ్చిన మరోకారు బలంగా ఢీకొట్టింది.

Also Read: బెంగళూరులో రోడ్డు ప్రమాదం.. చిత్తూరులో విషాదం.. భార్య కళ్లెదుటే దారుణం

కారు వేగంగా ఢీ కొట్టడంతో లక్ష్మణ్ సింగ్‌ ఎగిరి ఆగి ఉన్న కారుకి బలంగా తగిలాడు. రెండు కార్ల మధ్య చితికిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. కారుతో సహా ఉడాయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:
‘నా ప్యాంట్ విప్పేసి దాని కోసం ప్రాధేయపడేది..’ కామపిశాచిగా మారిన మహిళ, సెక్స్ కోసం వెర్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.