యాప్నగరం

తెలంగాణలో నకిలీ కరెన్సీ చలామణి!

మద్యం దుకాణాలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణలో నకిలీ నోట్ల దందా సాగుతోంది. ఈ బాగోతం వెనుక పెద్ద వ్యక్తుల హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి మంగళవారం సాగే వారాంత సంతలోనూ దొంగ నోట్లు జోరుగా చెలామణి అవుతున్నట్లు తెలిసింది.

Samayam Telugu 18 Dec 2019, 7:39 pm
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో నకిలీ కరెన్సీ నోట్ల చెలామణి గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. మద్యం దుకాణాలను లక్ష్యంగా చేసుకొని నకిలీ నోట్ల దందా కొనసాగిస్తున్నారు. కొనుగోలుదారులతో తీరిక లేకుండా ఉండే సమయంలో మద్యం దుకాణంలో నకిలీ కరెన్సీ అందజేస్తున్నారు. దీంతో మరుసటి రోజు వాటిని తీసుకొని బ్యాంకుకు వెళ్తున్న దుకాణాల యజమానులు కంగుతింటున్నారు. నకిలీ కరెన్సీగా గుర్తిస్తున్న ఉద్యోగులు వాటిని అక్కడికక్కడే చించేస్తున్నారు. ఈ బాగోతం వెనుక పెద్ద వ్యక్తుల హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Samayam Telugu fake


Also Read: బంధువులమంటూ ఇంటికొచ్చి.. మెడలో చైన్ లాక్కుని పరార్..!

మరికొంత మంది తమ వద్దకు వచ్చిన నోట్లు చెల్లనివని తెలియగానే వాటిని చించేస్తున్నారు. కొందరు మాత్రం పోలీసులకు తెలిస్తే ఎక్కడ తమపై కేసులు పెడతారోనని భయపడి తగులపెడుతున్నట్లు సమాచారం. ప్రతి మంగళవారం జన్నారంలో సాగే వారాంత సంతలోనూ దొంగ నోట్లు జోరుగా చెలామణి అవుతున్నట్లు తెలిసింది. నకిలీ నోట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: రూ. 7 లక్షలు కాపాడుకోవడానికి.. రూ. 49 లక్షలు ‘సమర్పయామి’.. రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.