యాప్నగరం

గోల్డ్ వ్యాపారిని నిలువునా దోచేసిన నకిలీ పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో నకిలీ పోలీసులు రెచ్చిపోయారు. బంగారు నగలు తయారుచేసే వ్యాపారిని విచారణ పేరుతో తీసుకెళ్లిన ఇద్దరు దుండగులు అతడి నుంచి నగదు, సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు.

Samayam Telugu 29 Jan 2020, 3:19 pm
హైదరాబాద్‌లో దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులమని నమ్మించి గోల్డ్ వ్యాపారిని నిలువుదోపిడీ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సమంథ్‌ హైదరాబాద్‌లో నివాసముంటూ బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటాడు. మంగళవారం రాత్రి సమంథ్ ఇంటికొచ్చిన ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని, ఓ కేసు విషయమై విచారించాలంటూ అతడిని బైక్‌పై తీసుకెళ్లారు.
Samayam Telugu fake police


Also Read: ఖతర్నాక్ లవర్స్... జల్సాల కోసం అడ్డదారులు తొక్కి చైన్ స్నాచింగ్‌లు

మాదన్నపేటలోని ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం వద్ద బైక్ ఆపిన వారిద్దరు సమంథ్‌ను బెదిరించి అతడి డెబిట్ కార్డులు లాక్కున్నారు. వాటిలో రూ.10వేల నగదు విత్‌డ్రా చేశారు. అనంతరం అతడిని కొట్టి సెల్‌ఫోన్ లాక్కుని బైక్‌పై పరారయ్యారు. దీంతో అవాక్కైన బాధితులు వారు నకిలీ పోలీసులను గుర్తించాడు. వెంటనే మాదన్నపేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Also Read: భార్య అందంగా ఉందని ఈర్ష్య.. వేధించి ప్రాణం తీసిన శాడిస్ట్ భర్త

దీంతో మాదన్నపేట పోలీసులతో పాటు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి నిందితులను పాతబస్తీకి చెందిన పాత నేరస్తులు వసీం, గౌస్‌గా గుర్తించారు. వారి కదలికలను పసిగట్టి కేవలం రెండు గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాలు తయారుచేసే సమంథ్‌ను దోచుకోవాలని వీరు కొంతకాలం క్రితమే ప్లాన్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read: స్పా సెంటర్లలో వ్యభిచారం.. విదేశీ బాలికల సహా 26 మంది అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.