యాప్నగరం

Hyderabad: ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

ఆదివారం అర్ధరాత్రి నరేందర్‌గౌడ్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Samayam Telugu 2 Mar 2020, 1:18 pm
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో విషాదం నెలకొంది. ఎల్బీనగర్‌ ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపెల్లి గ్రామానికి చెందిన నరేందర్‌గౌడ్‌గా గుర్తించారు
Samayam Telugu hyd


Also read: పెళ్లికి నిరాకరించిందని పైశాచికం.. ప్రియురాలి నోట్లో విషం పోసి

నరేందర్‌గౌడ్ కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి ఎల్బీనగర్ సమీపంలో నివాసముంటున్నాడు. ఇటీవల ఆర్థిక సమస్యలకు తోడు కుటుంబ కలహాలు కూడా మొదలయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఫ్లైఓవర్‌ పైకి చేరుకున్న నరేందర్‌ అక్కడి నుంచి కిందికి దూకేశాడు.

Also read: 90 ఏళ్ల వృద్ధురాలిపై 22 ఏళ్ల యువకుడి అత్యాచారం.. గోళ్లతో రక్కి దారుణంగా

పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అతడిని గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య ఘటనపై నరేందర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు.

Also read: కొద్దిరోజుల్లో బుల్లెట్ కొనిస్తామన్న తల్లిదండ్రులు.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.