యాప్నగరం

విశాఖ అక్కయపాలెంలో దారుణం.. కుటుంబంతో చేతిలో వ్యక్తి హత్య

అశోక్ ఇంటి సభ్యుల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. కనిపెంచిన తల్లి, తోడబుట్టిన అక్క, బావ కలిసి అశోక్‌ను హత్య చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 12 Jul 2020, 10:25 am
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
విశాఖలో వరుస నేరాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అక్కయ్యపాలెంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సొంత కుటుంబసభ్యులే అతడ్ని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నగరంలోని అక్కయ్యపాలెంలో జూలై11 80ఫిట్ రోడ్డులో దరి రామచంద్ర నగర్ లో శనివారం రాత్రి కస్తూరి ఆశోక వర్మ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు..

కస్తూరి అశోక్ వర్మ అనే వ్యక్తి వయసు 29 ఏళ్లు. అశోక్‌ను తని తల్లి, అక్క బావ కలిసి హత్య చేశారు. రాత్రి 10 గంటల సమయంలో తల్లి కస్తూరి వరలక్ష్మీ, అక్క శ్రీదేవి, బావ వెంకటేశ్వరరాజు ముగ్గురు కలిసి అతడ్ని హతమార్చారు. అనంతరం నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు... వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్నవారితో పాటు.. స్థానికుల్ని సైతం పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Read More:ప్రాణాలు తీసిన ప్రేమ.. ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణహత్య
హత్యకు గురైన మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. అయితే కుటుంబ సభ్యులే అశోక్‌ను ఎందుకు హత్ చేశారన్న విషయం ఇంకా తెలియలేదు. ఇదే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారి మధ్య ఆస్తి తగాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇతర బంధువులతో కూడా పోలీసులు మాట్లాడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.