యాప్నగరం

పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న రైతు.. విశాఖ జిల్లాలో దుర్ఘటన

పొలంలో పని చేసుకుంటున్న సమయంలో వీఆర్వో, సర్వేయర్ అడ్డుకోవడంతో రైతు ఆత్మహత్యా యత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 22 Apr 2020, 8:55 pm
వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా అడ్డుకున్నందుకు ఓ రైతు ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సబ్బవరం మండలం ఇరువాడకు చెందిన అప్పారావు అనే రైతు పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. గ్రామంలోని తన 15 సెంట్ల డీ పట్టా భూమిలో పని చేసుకుంటుండగా వీఆర్వో, సర్వేయర్ అడ్డుకున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


దీంతో మనస్ధాపానికి గురైన రైతు పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటనలో రైతుకి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే భూమి వ్యవహారంలో తనను కొద్దికాలంగా అధికారులు, అధికార పార్టీ నేత ఒకరు వేధింపులకు గురిచేస్తున్నట్లు రైతు అప్పారావు ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read: వావీవరసలు మరచిన అన్నాచెల్లెళ్లు.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.