యాప్నగరం

తండ్రీకొడుకులకు పాముకాటు.. బాలుడి మృతి.. నిజామాబాద్‌లో విషాదం

పాముకాటేయడంతో ఆరోగ్యం విషమించి బాలుడు మరణించాడు. తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Samayam Telugu 3 Jul 2020, 9:03 pm
తండ్రీకొడుకులను పాము కాటేసిన విషాద ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని జిల్లాలోని మోపాల్‌ మండలం గూడెం కాలనీకి చెందిన నాగరాజు, అతని కొడుకు చరణ్(12) పాముకాటుకు గురయ్యారు. తండ్రీకొడుకుని కాటేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
snake bite


అయితే కొడుకు చరణ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి నాగరాజుని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. పాముకాటుకు గురై కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Als0 Read: పేషెంట్‌ని కొట్టిచంపేసిన ఆస్పత్రి యాజమాన్యం.. కారణం తెలిస్తే షాకే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.