యాప్నగరం

Yadadri: కూతురిపై కన్నతండ్రి నీచం.. యాదాద్రి భువనగిరిలో దారుణం

తల్లితో గొడవపడుతున్నాడని తండ్రికి భోజనం పెట్టేందుకు వెళ్లింది కూతురు. కీచక తండ్రి కన్నకూతురని కూడా చూడకుండా ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. యాదాద్రిలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 21 Nov 2020, 3:03 pm
ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు వావీవరసలు మరచి మరీ బరితెగిస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే కన్నేసిన కీచక తండ్రి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. భోజనం పెడుతున్న కూతురిపై కామంతో నీచానికి పాల్పడిన దారుణ ఘటన యాదాద్రి భువనగిరిలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape attempt


జిల్లాలోని మోత్కూరుకు చెందిన ఆటో డ్రైవర్‌కి భార్య, నలుగురు కూతుళ్లు సంతానం. విభేదాల కారణంగా భార్య 17 ఏళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయింది. రెండేళ్ల కిందట వారి మూడో కూతురు చనిపోయిందని తెలియడంతో భార్య తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి భర్త, పిల్లలతో కలసి ఉంటోంది. కొద్దిరోజులుగా మళ్లీ భార్యాభర్తల నడుమ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాలుగో కూతురు తండ్రికి భోజనం పెట్టేందుకు ఉపక్రమించింది.

ఆ సమయంలో కీచకుడిగా మారిన తండ్రి భోజనం పెడుతున్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్నకూతురిపై అత్యాచారయత్నం చేశాడు. తీవ్రంగా ప్రతిఘటించడంతో ఈ విషయం ఎవరికైనా చెబితే ఇంట్లో నుంచి వెళ్లగొడతానంటూ బెదిరింపులకు దిగాడు. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో తండ్రి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.