యాప్నగరం

ఇద్దరు కూతుళ్లతో సహా తండ్రి సూసైడ్.. కడపలో విషాదం

ఇద్దరు కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో వెలుగుచూసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Samayam Telugu 28 Feb 2020, 3:01 pm
అరకొర సంపాదనతో ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఓ ఆటోడ్రైవర్ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన ఇద్దరు కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. బిడ్డలతో కలసి ఊరికి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu death3


గోపవరం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన బాలకొండయ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన భార్య బుజ్జమ్మ ఆరేళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి నుంచి బాలకొండయ్య కూతుళ్లను పెంచుకుంటూ జీవిస్తున్నాడు. ఆటో నడపగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించడం కష్టతరమడంతో లోకాన్ని విడిచిపెట్టాలని నిర్ణయానికి వచ్చాడు.

Also Read: ప్రియుడితో గదిలో దొరికిపోయిన ఆంటీ.. నగ్నంగా ఊరంతా తిప్పి.. చివరికి అదిరిపోయే ట్విస్ట్

తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించాడేమో ఇద్దరు కుమార్తెలు భావన(11), శోభన(8)తో కలసి ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటుగా పొలానికి వెళ్తున్న రైతులు బావిలో తేలియాడుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.

Read Also: ఆపదలో ఉన్న యువతిపై రెండుసార్లు రేప్.. ఆదుకోని ముక్కుపుడక

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.