యాప్నగరం

కొడుకు ప్రేమకి తండ్రి బలి.. రాజన్న సిరిసిల్లలో దారుణం

ప్రేమ జంట ఇంటి నుంచి పారిపోయిందని తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. ప్రియుడి తండ్రిని దారుణంగా కొట్టారు.

Samayam Telugu 30 Oct 2020, 6:32 pm
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రేమజంట పారిపోయి పెళ్లి చేసుకుందన్న కోపంతో అమ్మాయి బంధువులు ప్రియుడి తండ్రిని కొట్టి చంపేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. బోయినిపల్లి మండలంలోని స్తంభంపల్లికి గౌతమి, మహేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలను సంప్రదించారు. అందుకు పెద్దలు ససేమిరా అనడంతో దసరా పండుగ రోజున ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu అబ్బాయి తండ్రి లక్ష్మీనారాయణ
sircilla murder


కూతురు ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ పెళ్లి చేసుకుందని తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. మూకుమ్మడిగా అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. మహేష్ తండ్రి లక్ష్మీనారాయణను విచక్షణా రహితంగా చావబాదారు. అమ్మాయి కుటుంబ సభ్యుల దాడిలో తీవ్రగాయాలపాలైన లక్ష్మీనారాయణను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీనారాయణ మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: బైకుపై ప్లాస్టిక్ సంచిలో శవం.. నిజామాబాద్‌లో కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.