యాప్నగరం

కూతురిని బలిచ్చిన రాక్షసుడు.. మంత్రగత్త మాటలు విని..

ఇంటికి సమీపంలోని చెట్ల వద్ద బాలిక అచేతనంగా పడిపోయి కనిపించింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Samayam Telugu 2 Jun 2020, 7:12 pm
కంప్యూటర్ యుగంలోనూ మూఢనమ్మకాలతో కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. చేతబడి, నరబలి పేరుతో ఉన్మాదానికి దిగుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగుచూసింది. నరబలి ఇస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయని.. కుటుంబం సౌభాగ్యంతో విరాజిల్లుతోందంటూ కన్నకూతురిని బలిచ్చిన అమానుష ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అభం శుభం తెలియని చిన్నారిని కన్నతండ్రే దారుణంగా హత్య చేసిన కిరాతక ఘటన తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో జరిగింది. గందర్వకొట్టై ప్రాంతానికి చెందిన వ్యక్తి మంత్రగత్తె మాటలు విని ఏకంగా కూతురిని బలిచ్చాడు. కూతురిని నరబలిగా ఇస్తే కుటుంబం సౌభాగ్యంతో విరాజిల్లుతుందని మంత్రగత్తె చెప్పడంతో తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Also Read: కూతురిపై కన్నతండ్రి కామం.. మూణ్నెళ్లు నరకం.. గర్భం దాల్చడంతో..

తాగునీరు తెచ్చేందుకు బయటికెళ్లిన కూతురిని సమీపంలోని తోటలోకి తీసుకెళ్లిన తండ్రి అమాంతం ఆమె గొంతుపిసికి హత్యా యత్నం చేశాడు. ఆమె చనిపోయిందని అక్కడే పడేసి వెళ్లిపోయాడు. బాలికను గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. కుటుంబ సభ్యులపై అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేయడంతో కన్నతండ్రే హత్య చేసినట్లు తేలింది. మూఢనమ్మకాలతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. హత్య కేసుగా మార్పు చేసిన పోలీసులు తండ్రి పనీర్‌సెల్వంతో సహా సహా సహకరించిన కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

Read Also: పడక సుఖం కోసం పాకులాడిన మహిళ.. చివరికి.. కడప ‘చాందిని’ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.