యాప్నగరం

భార్యాబిడ్డలపై కిరోసిన్ పోసిన కన్నతండ్రి.. సజీవదహనం, ఆ గొడవే కొంప ముంచింది

ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరికి ఇద్దరూ మరణించారు. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.

Samayam Telugu 19 Aug 2020, 6:09 pm
కుమార్తె వేరే కులస్థుడ్ని ప్రేమించిందనే కారణంతో తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు, భార్య అని చూడకుండా వారిపై కిరోసిన్ పోసి చంపేందుకు యత్నించాడు. ఇంతలో తీవ్రమైన మనస్తాపానికి గురైన భార్య తమకు తామే చనిపోతామంటూ అగ్గిపుల్ల గీసి అంటించుకుంది. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరికి ఇద్దరూ మరణించారు. ఈ దారుణమైన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Fire


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని మోగిలి గిద్ద గ్రామంలో పాండు కుటుంబం నివాసం ఉంటోంది. అతని భార్య చంద్రకళ, కుమార్తె స్రవంతి. స్రవంతి అదే గ్రామానికి చెందిన రామదాసుతో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లితండ్రులకు తెలిసింది. దీంతో తండ్రి ఆమెను తీవ్రంగా మందలించాడు. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది.

Must Read: undefined

కన్న తండ్రి పాండు బిడ్డపై, భార్యపై కిరోసిన్ పోశాడు. తల్లి వెంటనే తామే చనిపోతామంటూ అగ్గిపుల్ల గీసి అంటించుకుంది. దీంతో శరీరమంతా మంటలు అంటుకున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రకళ, కూతురు స్రవంతిని చికిత్స కోసం షాద్‌నగర్ ప్రభుత్వ హోస్పటల్‌కు తరలించారు. తన తండ్రే తమపై కిరోసిన్ పోశాడని కుమార్తె తెలిపింది.

ప్రేమ విషయంలో తన కుమార్తె మాట వినకపోవడంతో ఇంట్లో తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోందని, ఇద్దరిలో ఎవరైనా చావాలంటూ భర్త ఇద్దరిపై కిరోసిన్ పోసినట్లు భార్య చంద్రకళ తెలిపింది. పోలీసులు వాంగ్మూలాన్ని రికార్డు చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. బాధితురాలు స్రవంతి స్టేట్‌మెంట్ ప్రకారం భర్త పాండు, భార్య చంద్రకళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.