యాప్నగరం

కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు

కన్నకూతురిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న కీచక తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. బాలిక ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 26 Aug 2020, 9:41 am
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కన్నకూతురిపైనే రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న నీచపు ఘటన ఇది. ఆ కామాంధుడి చేతిలో నరకం చవిచూస్తున్న బాలిక తెలిసీ తెలియని వయసులోనే గర్భం దాల్చి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో వెలుగుచూసింది.
Samayam Telugu Image


Also Read: గుంటూరు: అఫైర్ కోసం రెండు ప్రాణాలు బలి.. భార్య, ప్రియురాలిని చంపేసిన డ్రైవర్

నగరంలోని పంత్ నగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక రాజావాడీ ఆసుపత్రిలో రెండ్రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె మైనరని గుర్తించిన డాక్టర్లు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని ప్రశ్నించగా షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 2018, మార్చి నుంచి కన్నతండ్రే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదరించాడని తెలిపింది.

Also Read: యాదాద్రి: బంధువు బైక్ ఎక్కిన గర్భిణి.. గదిలో బంధించి రెండ్రోజులు రేప్

తాను గర్భం దాల్చినా కూడా విడిచిపెట్టకుండా తండ్రి లైంగిక దాడికి పాల్పడేవాడని బాధితురాలు చెప్పింది. దీంతో ఆ నీచుడిపై ఐపీసీ 376, సెక్షన్ 4,6,8,10,12 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూతురినే తల్లిని చేసిన ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: నిజామాబాద్‌లో కీచక పర్వం.. అర్థరాత్రి మహిళపై 12 మంది గ్యాంగ్ రేప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.