యాప్నగరం

బైక్ ఆపిన కానిస్టేబుల్‌పై లాఠీతో దాడి.. శ్రీకాకుళంలో తండ్రీకొడుకుల పైశాచికం

లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా బైక్‌పై తిరుగుతున్న తండ్రీ కొడుకులను కానిస్టేబుల్ ఆపాడు. దీంతో ఆగ్రహించిన వారిద్దరు లాఠీని లాక్కుని కానిస్టేబుల్‌పైనే దాడికి పాల్పడ్డారు.

Samayam Telugu 29 Mar 2020, 9:27 am
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై తండ్రీ కొడుకులు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో శనివారం జరిగింది. రైతుబజార్ వద్ద శనివారం కానిస్టేబుల్‌ భైరి జీవరత్నం విధులు నిర్వహిస్తున్నారు. టెక్కలి మండలం పరశురాంపురం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు వాకాడ శ్రీనివాసరావు, వినీత్‌లు బైక్‌పై వెళ్తుండగా కానిస్టేబుల్‌ ఆపారు.
Samayam Telugu hyd


Also Read: లాక్‌డౌన్‌లోనూ రెచ్చిపోతున్న కామాంధులు.. బాలికపై 10 మంది గ్యాంగ్‌రేప్

దీంతో ఆ తండ్రీ కొడుకులు కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. బైక్ ఎందుకు ఆపావంటూ అతడిపై దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని లాక్కుని ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. వినీత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ జీవరత్నాన్ని జిల్లా ఎస్పీ కె.అమ్మిరెడ్డి పరామర్శించారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Also Read: కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య.. గుంటూరు జిల్లాలో కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.