యాప్నగరం

పాడిబర్రె కోసం ప్రాణాలు కోల్పోయిన తండ్రీకొడుకులు.. భూపాలపల్లిలో విషాదం

పాడిబర్రెని ఇంటికి తెచ్చేందుకు తండ్రీకొడుకులు వెళ్లారు. చెరువులో దిగిన బర్రెని బయటికి తెచ్చేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 9 Aug 2020, 5:28 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాడిబర్రె కోసం వెళ్లిన తండ్రీకొడుకులు ప్రమాదవశాత్తూ నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. మొగుళ్లపల్లి మండలం పర్లపల్లికి చెందిన ఓదేలు(70)కి చెందిన పాడిబర్రె చెరువులోకి దిగింది. దానిని తీసుకొచ్చేందుకు కొడుకు మధుకర్‌(30)తో సహా వెళ్లిన ఓదేలు చెరువులో దిగారు. ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయి బయటికి రాలేక మరణించారు. బర్రె కోసం వెళ్లి తండ్రీకొడుకులు మృత్యువాతపడడం స్థానికంగా తీవ్రవిషాదం నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


Also Read: మగ వ్యభిచారులతో శృంగారం.. కస్టమర్ డబ్బులు ఎగ్గొట్టడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.