యాప్నగరం

తండ్రీకొడుకుల దారుణ హత్య.. నిందితులు ఐసీయూలో..

పొలం బాట విషయమై ఇరుకుటుంబాల మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. బాబాయి కుటుంబం అడ్డుతొలగించుకోవాలని భావించిన అన్న కొడుకు దారుణానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 20 Aug 2020, 9:11 pm
పొలం దారి కోసం బంధువుల నడుమ మొదలైన వివాదం రెండు ప్రాణాలను బలితీసుకుంది. దాయాదుల చేతిలో తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో జరిగింది. ఇరంగులూర్‌‌కి చెందిన రోగ్ రాజ్‌(70)కి నడుకరైలో వ్యవసాయ భూమి ఉంది. దాని పక్కనే అతని అన్న కొడుకు జేసురాజ్‌కి కొంత భూమి ఉంది. జేసురాజ్ పొలంలోకి వెళ్లే దారి విషయమై ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. అదే గొడవల్లో జేసురాజ్ తండ్రి ఆరోక్యాన్ని సొంత తమ్ముడైన రోగ్ రాజ్ హత్య చేసి జైలుకి వెళ్లొచ్చాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murders


రెండేళ్ల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. అదే విషయమై ఇరుకుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రోగ్ రాజ్, అతని కుమారుడు జాన్ డేవిడ్(27)పై జేసురాజ్(59), అతని కొడుకు ప్రిన్స్(23) మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. ఐరన్ రాడ్లతో కొట్టి కొడవలితో నరికి కిరాతకంగా హత్య చేశారు. తండ్రీకొడుకులు తిరగబడడంతో నిందితులిద్దరికీ గాయాలయ్యాయి. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. సమయపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీరంగం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: సంపాదన సరిపోని టైలర్.. చీర, జాకెట్ కట్టుకుని జంక్షన్‌లో.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.