యాప్నగరం

ఆడుకుంటుండగా ఎగసిన అగ్నికీలలు.. నలుగురు చిన్నారుల సజీవ దహనం

ఒడిశాలోని గంజాం జిల్లా ఖొయిరఛోటి గ్రామంలో ఆదివారం చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 24 Feb 2020, 10:27 am
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పొలసరా సమితిలో మాళొతెంతులియా పంచాయతీలోని చిన్న గ్రామం ఖొయిరఛొటిలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై అటు బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు, ఇటు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు.
Samayam Telugu odisha


Also Read: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి... రూ.3లక్షల డిమాండ్

ఖొయిరఛొటి గ్రామంలోని గౌడ సమాజ భవనం సమీపాన శివ మందిరం వెనుకవైపు కొద్దిరోజులుగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు వెదుర్లతో మంచెగా కట్టి, పైన, కింద ఎండు గడ్డిని అమర్చి రోజూ ఆడుకుంటున్నారు. ఆదివారం ఉదయం ట్యూషన్ల నుంచి తిరిగి వచ్చిన నలుగురు చిన్నారులు రోజూ మాదిరిగానే మంచెలో ఆడుకుంటున్నారు. అయితే వారున్న చోట గడ్డికి హఠాత్తుగా నిప్పంటుకుని అగ్నికీలలు వ్యాపించాయి. బాలుర కేకలు విని వచ్చి స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షించి పొలసరా ప్రభుత్వానికి తరలించారు.

Also Read: భర్త విదేశాల్లో, డ్రైవర్‌తో భార్య అఫైర్... సెక్స్ కోసం కన్నబిడ్డలను వదిలేసి

ప్రమాదంలో గాయపడ్డ నలుగురు చిన్నారుల్లో సాయిరాం జాని (4), దీపక్‌ గౌడ (8) మార్గమధ్యంలోనే మృతిచెందగా, ఇతిశ్రీ జెనా (7) అనే బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. అలోక్‌ జెనా(5) అనే బాలుడిని మెరుగైన చికిత్స కోసం కటక్‌ ఎస్సీబీసీకి తరలించగా చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇతిశ్రీ, అలోక్‌ అన్నదమ్ముల బిడ్డలు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పొలసరా ఎమ్మెల్యే శ్రీకాంత్‌ సాహు ఆరోగ్య కేంద్రానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.

Also Read: 15ఏళ్లు పెద్దదైన ఆంటీతో అఫైర్.. భార్య ఎదుటే ప్రియురాలిని బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.