యాప్నగరం

ట్రక్కుని ఢీకొట్టిన కారు.. ఇద్దరు డ్రైవర్లు సహా ఐదుగురి దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు ఢీకొని ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Samayam Telugu 4 Apr 2020, 5:42 pm
ట్రక్కుని కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ అతివేంగా వచ్చిన కారు ట్రక్కుని బలంగా ఢీకొట్టడంతో డు వాహనాల డ్రైవర్లు సహా ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో అహ్మదాబాద్ హైవేపై జరిగింది.
Samayam Telugu death


జంకంబాలియా గ్రామానికి చెందిన కుటుంబం గాంధీనగర్ వెళ్లేందుకు కారులో బయల్దేరింది. అహ్మదాబాద్ హైవేపై ప్రయాణిస్తుండగా అర్ధరాత్రి సమయంలో కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు బలంగా ట్రక్కుని ఢీకొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా మరొకరు తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

Also Read: మద్యం దొరక్క కూల్‌డ్రింక్‌లో షేవింగ్ లోషన్.. ఇద్దరు యువకులు మృతి.. తీవ్ర విషాదం

ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా మిగిలిన ఇద్దరు ప్రమాదానికి గురైన వాహనాల డ్రైవర్లు. ప్రమాద విషయం తెలుసుకున్న లింబ్డి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.