యాప్నగరం

అయేషా మీరా అవశేషాలు సేకరించిన సీబీఐ.. రీపోస్ట్‌మార్టం ఎలా జరిగిందో తెలుసా?

విజయవాడ శివారులోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో 2007 సంవత్సరంలో హత్యాచారానికి గురైన అయేషా మీరా రీ పోస్ట్‌మార్టం శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తెనాలిలోని చెంచుపేట ముస్లిం శ్మశానవాటికలో శనివారం ఉదయం సీబీఐ అధికారులు ఆమె అవయాలకు పంచనామా చేశారు. దిల్లీ, హైదరాబాద్‌, విశాఖ నుంచి వచ్చిన దాదాపు 20 మంది అధికారులు, వైద్యులు, నిపుణులు ఈ ప్రక్రియలో పాలుపంచుకున్నారు.

Samayam Telugu 15 Dec 2019, 9:57 am
విజయవాడ శివారులోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో 2007 సంవత్సరంలో హత్యాచారానికి గురైన అయేషా మీరా రీ పోస్ట్‌మార్టం శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. తెనాలిలోని చెంచుపేట ముస్లిం శ్మశానవాటికలో శనివారం ఉదయం సీబీఐ అధికారులు ఆమె అవయాలకు పంచనామా చేశారు. దిల్లీ, హైదరాబాద్‌, విశాఖ నుంచి వచ్చిన దాదాపు 20 మంది అధికారులు, వైద్యులు, నిపుణులు ఈ ప్రక్రియలో పాలుపంచుకున్నారు.
Samayam Telugu forensic and cbi officers finished ayesha meera re post mortem
అయేషా మీరా అవశేషాలు సేకరించిన సీబీఐ.. రీపోస్ట్‌మార్టం ఎలా జరిగిందో తెలుసా?


మతపెద్దల సమక్షంలో అవయవాల వెలికితీత

శనివారం తెల్లవారుజామున ఓ టీమ్ శ్మశానవాటికకు చేరుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వైద్య నిపుణులు ఆలస్యంగా కావడంతో పంచనామా కూడా ఆలస్యమైంది. తొలుత ఆయేషామీరాను ఆప్పట్లో ఖననం చేసిన ప్రాంతాన్ని గుర్తించి, సమాధి చుట్టూ మార్కింగ్‌ ఇచ్చి, బారికేడ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల సమయంలో మతపెద్దల సమక్షంలో సమాధిని తవ్వి.. లోపలి ఎముకలను సేకరించి అస్థిపంజరం రూపంలో అమర్చారు. కొన్ని అవశేషాలను సేకరించి మిగిలిన అవయవాలను తిరిగి పూడ్చివేశారు.

అవశేషాలు తీసుకెళ్తున్న అధికారి

మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రక్రియ పూర్తికావడంతో అధికారులతో పాటు, మతపెద్దలు తిరిగి వెళ్లిపోయారు. ఆయేషామీరా విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు వసతిగృహంలో 2007 డిసెంబరు 27న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయిన 12ఏళ్ల కావడంతో ఆమె శరీరం నుంచి పుర్రె, ఎముకలు మాత్రమే లభించాయి. వీటి ఆధారంగానే అయేషాకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయో పరిశీలించనున్నారు.

పోలీసుల తీరుపై ఎన్నో విమర్శలు

అయేషాకు తలపై బలమైన గాయాలు కావడంతో చనిపోయిందని పోలీసులు ఛార్జిషీటులో తప్పుగా పేర్కొన్నారని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై అయేషా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిగా పేర్కొన్న సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా నిర్ధారించడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

ప్రముఖుల పిల్లలపై ఆరోపణలు

ఈ కేసులో పెద్ద మనుషుల బిడ్డల హస్తం ఉందని, అందుకే తప్పుదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అయేషా మీరా తల్లి ఎప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.