యాప్నగరం

మాంసం కోసం జింకల వేట.. నేతల హస్తం, యాదాద్రిలో కలకలం

జింకను వేటాడి చంపి తిన్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపుతోంది. ఘటన వెనుక రాజకీయ నాయకులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 1 Aug 2019, 11:05 pm
తెలంగాణలో రాష్ట్ర అధికార జంతువు జింక ప్రాణానికి ముప్పు వచ్చింది. మాంసం కోసం జింకలను తెగ వేటాడేస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకుల హస్తం కూడా ఉండటం మరింత ఆందోళనకరం విషయం. ఇన్నాళ్లూ చర్మం, కొమ్ముల కోసం వేటగాళ్లు జింకలకు వల పన్నగా.. ఇప్పుడు జింక మాంసం కోసం వేట తీవ్రమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర అధికార జంతువు మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని వణ్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu deer
జింక హత్య


మాంసం కోసం జింకను వేటాడి చంపిన ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలో కలకలం రేపుతోంది. మండలంలోని కొండాపురం అటవీ ప్రాంతంలో కొద్ది రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంత మందితో కలిసి స్థానిక రాజకీయ నాయకులు కొందరు జింక మాంసం తిన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

ఎముకలు


ఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చినా.. నిర్లక్ష్యం వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జింకను వేటాడినట్లు సమాచారం రావడంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఘటనపై విచారణ ప్రారంభించారు.

కొండాపురం గ్రామం సమీపంలోని అడవిలో వలపన్ని జింకను పట్టుకున్నట్లు అటవీ అధికారులతో కొంత మంది గ్రామస్థులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల నిమిత్తం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జింకను చంపి తిన్న వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఏ ఒక్కరు దొరికినా అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.