యాప్నగరం

కూతురిని చావబాది.. నడిరోడ్డులో గుండుకొట్టించి.. దారుణం

కన్నకూతురిపై కన్నవాళ్ల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఆమె కాళ్లావేళ్లాపడి వేడుకుంటున్నా కనీస కనికరం లేకుండా అందరి ముందు అవమానానికి గురిచేశారు.

Samayam Telugu 1 Mar 2020, 3:42 pm
కూతురు తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవాల్సి తల్లిదండ్రులే రోడ్డెక్కి అల్లరిపాల్జేసిన ఘటన వెలుగుచూసింది. ఆమె చేసిన చిన్న పనినే తప్పుగా భావించి ఆగ్రహంతో ఊగిపోతూ తీవ్రంగా కొట్టడయే కాకుండా నడిరోడ్డులోకి లాక్కొచ్చి దారుణానికి ఒడిగట్టారు. అందరూ చూస్తుండగానే గుండుకొట్టించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu braid off


అలీరాజ్‌పూర్‌కి చెందిన ఓ మైనర్ బాలిక, తనకు తెలిసిన యువకుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండటాన్ని ఆమె తల్లిదండ్రులు గమనించారు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కన్న బిడ్డని, అసలు ఏమైందో తెలుసుకోవాలని కూడా ఆలోచించకుండా తప్పు చేశావంటూ దాడికి దిగారు. దారుణంగా చావబాది నడిరోడ్డుపైకి లాక్కొచ్చారు.

Also Read: ఇద్దరితోనూ ఆ సంబంధం.. తెలిసిపోవడంతో.. మహబూబ్‌నగర్ మహిళ సూసైడ్ కేసులో షాకింగ్ ట్విస్ట్

ఇకపై అబ్బాయితో మాట్లాడనని.. తనను క్షమించాలని ఆమె వేడుకున్నా కనికరం చూపకుండా.. అందరూ చూస్తుండగానే గుండు కొట్టించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరలైంది. వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

Read Also: తల్లా.? ప్రియురాలా.? తేల్చుకోలేకపోయిన యువకుడు.. చివరికి బర్త్‌డే రోజే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.