యాప్నగరం

కర్నూలులో కలకలం.. రైల్వే ట్రాక్‌పై నలుగురి మృతదేహాలు

రైల్వే ట్రాక్‌పై నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. రైలు ఢీకొనడంతో శరీరాలు ఛిద్రమై భయానకంగా మారాయి. వారిది ఆత్మహత్యా? ప్రమాదమా? తెలియాల్సి ఉంది.

Samayam Telugu 3 Nov 2020, 2:06 pm
కర్నూలు జిల్లాలో ఘోరం వెలుగుచూసింది. రైల్వే ట్రాక్‌పై నలుగురు మృతదేహాలు పడి ఉండడం తీవ్ర కలకలం రేపింది. పాణ్యం సమీపంలోని కౌలూరు గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. రైలు ఢీకొనడంతో మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. ప్రమాదవశాత్తూ రైలు కింద పడి చనిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలంలో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా మృతులను నంద్యాలలోని రోజాకుంట వాసులుగా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ సలాం, అతని కుటుంబ సభ్యులుగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
railway track


Also Read: కారులో వచ్చి యువతి కిడ్నాప్.. అనంతపురంలో కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.