యాప్నగరం

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

చెరువుకట్టపై వ్యాన్, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 4 Jul 2020, 8:43 am
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న వ్యాన్, ఆటో ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పీలేరు నియోజర్గ పరిధిలోని కంభంవారిపల్లె మండలం సొరకాయలపేట చెరువు కట్టపై ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
accident


మృతుల బంధువు ఒకరు చనిపోవడంతో వారంతా చివరి చూపుల కోసం వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారంతా కలకడ మండలం కొత్త గాండ్ల పల్లికి చెందిన వెంకటరమణ కుటుంబ సభ్యులుగా సమాచారం. వెంకటరమణ, పార్వతమ్మ, సుగుణమ్మ, రెడ్డి గోవర్దిని, దామోదరం ప్రాణాలు విడువగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.
Also Read: బంగారం అడిగిన బావ.. నరికేసిన బావమరుదులు.. ఇద్దరి దారుణ హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.