యాప్నగరం

Hyderabad: గాంధీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న విద్యార్థిని అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది. వివాహ సంబంధాలు చూస్తున్న సమయంలో బలవన్మరణానికి పాల్పడింది.

Samayam Telugu 5 Dec 2020, 11:11 am
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో వైద్య విద్యనభ్యసిస్తున్న ఝాన్సీ ఈ రోజు ఆత్మహత్య చేసుకుంది. మల్కాజ్‌గిరిలోని ప్రశాంత్ నగర్‌లో నివాసముంటున్న ఝాన్సీ గాంధీలో పీజీ చదువుతోంది. అనూహ్యంగా హాస్టల్‌లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మెడికో ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆమెకు కొద్దిరోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధాలు కుదరడం లేదని ఆమె మనస్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
doctor suicide


Also Read: రోడ్డు ప్రమాదంలో భర్త మరణం.! భార్యని పట్టించిన బీమా పాలసీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.