యాప్నగరం

పేదలకు అన్నం పెడుతున్న కుటుంబంపై అఘాయిత్యం... ప్రకాశం జిల్లాలో దారుణం

లాక్‌డౌన్ కారణంగా పేదలకు భోజనం అందిస్తున్న కుటుంబంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండల పరిధిలో జరిగింది.

Samayam Telugu 1 Jun 2020, 5:38 pm
లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అల్లాడుతున్న పేదలకు భోజనం పంపిణీ చేసే విషయంలో తలెత్తిన వివాదం ఓ కుటుంబంపై దాడికి దారితీసిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో ఆదివారం జరిగింది. కరణం వెంకటేష్ యూత్ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా చేనేతపురి కాలనీలో పేదలకు భోజనం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనుభవం వెంకటేశ్వర్లు కుటుంబం పర్యవేక్షిస్తోంది. ఇది నచ్చని ఆమంచి కృష్ణమోహన్ అనుచరులైన అనుములు శ్రీను అలియాస్ శివ, అతడి తమ్ముడు పృథ్వి మరో నలుగురు కలిసి ఆదివారం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలంటే తమ నాయకుడే చేయాలని, ఇతరులెవరూ చేయడానికి వీల్లేదని వారు హెచ్చరించారు.
Samayam Telugu చీరాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్
Family Attack in Chirala


Also Read: ఆంటీతో అఫైర్, మద్యం మత్తులో కొట్టి సజీవ సమాధి... నెల్లూరులో దారుణం

అయితే పేదలకు మంచి పని చేయడానికి ఎవరి అనుమతి కావాలని వెంకటేశ్వర్లు నిలదీయడంతో ఆ గ్యాంగ్ రెచ్చిపోయారు. వెంకటేశ్వర్లుతో పాటు ఆయన కొడుకు ప్రశాంత్‌ను చితకబాదారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వెంకటేశ్వర్లు భార్య ఉమామహేశ్వరిని తీవ్రంగా కొట్టారు. తలను గోడకేసి బలంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను స్థానికులు చీరాల ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వివిధ సంఘాల నేతలు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రజలకు సాయం చేసేవారిపై ఇలాంటి దాడులు సమంజసం కాదని, నిందితులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు.

Also Read: ఛార్జింగ్ వైరుతో భార్య గొంతు బిగించి హత్య.. పోలవరంలో భర్త ఘాతుకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.