యాప్నగరం

హైదరాబాద్ పాతబస్తీలో యువతి కిడ్నాప్‌ కలకలం.. తండ్రి కళ్లల్లో కారం కొట్టి

హుమాయన్‌నగర్‌కు చెందిన మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి కుమార్తెను గురువారం కొందరు యువకులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. షరీఫ్ తీవ్రంగా ప్రతిఘటించడంతో కిడ్నాపర్లు పారిపోయారు.

Samayam Telugu 17 Apr 2020, 9:47 am
హైదరాబాద్ పాతబస్తీలో యువతి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. హుమాయన్‌నగర్‌లోని శాంతినగర్‌లో నివాసముండే మహ్మద్ షరీఫ్‌ గురువారం మధ్యాహ్నం తన కూతురితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. అప్పటికే ఆ ఇంటి సమీపంలో వేచి చూస్తున్న కొందరు యువకులు వారిని చుట్టుముట్టారు. షరీఫ్ కూతురిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన షరీఫ్ వారిని తీవ్రంగా ప్రతిఘటించాడు. కూతురిని గట్టిగా పట్టుకుని వదల్లేదు.
Samayam Telugu hyd3


Also Read: భార్యను చంపి భర్త ఆత్మహత్య... విషాదాంతమైన వృద్ధ దంపతుల జీవిత ప్రయాణం

దీంతో రెచ్చిపోయిన దుండగులు అతడి తలపై బీరు బాటిళ్లతో దాడి చేసి కళ్లల్లో కారం కొట్టారు. అయినప్పటికీ ఆయన తన కూతురిని గట్టిగా పట్టుకుని వదల్లేదు. కొంతసేపటికి తండ్రి నుంచి యువతిని వేరు చేసిన దుండగులు ఆమెను కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో వారంతా భయంతో ఆమెను విడిచిపెట్టి పరారయ్యారు.

Also Read: మరో మహిళతో అఫైర్.. అడ్డుగా ఉందని భార్య చంపి.. కడపలో దారుణం

నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదేప్రాంతానికి చెందిన సల్మాన్ మీర్జా బేగ్‌, అతడి స్నేహితులుగా గుర్తించారు. అయితే వారు యువతిని ఎందుకు కిడ్నాప్ చేశారన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిలో ప్రేమ వ్యవహారమేదైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఆంటీలపై బీటెక్ స్టూడెంట్ కన్ను.. 50 మందిని నగ్నంగా వీడియో తీసి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.