యాప్నగరం

గ్యాంగ్‌స్టర్ నయీమ్ మేనకోడలు దుర్మరణం.. ఎన్నో హత్యల్లో..?

రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ మేనకోడలు దుర్మరణం చెందింది. కారులో అతి వేగంగా ప్రయాణిస్తూ లారీని వెనుక నుంచి గుద్దడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

Samayam Telugu 12 Jan 2020, 8:48 pm
గ్యాంగ్‌స్టర్‌ నయీమ్ మేనకోడలు షాహిదా సాజిద్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. నల్లగొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ప్రమాద సమయంలో షాహిదానే కారు డ్రైవింగ్‌ చేస్తోంది. వేగంగా దూసుకొచ్చిన కారు.. లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జవగా, ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది.
Samayam Telugu nayeem


Also Read: Chittoor: యువకుడి ప్రాణం తీసిన జల్లికట్టు.. ఐసీయూలో ముగ్గురు

షాహిదా నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చరీకి తరలించారు.

కాగా, గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుల్లో ఆయన మేనకోడలు షాహిదా సాజిద్ కూడా ఒకరనే విషయం తెలిసిందే. నయీం మారణకాండలో ఈమె హస్తం కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌కు చెందిన బెస్త కిష్టయ్య, జోడు ఆంజనేయులుల జంట హత్య కేసుల్లో కూడా ఆమె నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాగే నయీమ్ చేసిన పలు హత్యల్లోనూ ఆమె పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు.

Also Read: హన్మకొండ యువతి హత్య కేసులో సంచలనాలు.. సీపీ ప్రెస్‌మీట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.