ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. ఫేస్బుక్లో పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమన్నంతగా దగ్గరయ్యారు. ఆ చనువు కాస్తా సహజీవనానికి దారితీసింది. అప్పుడప్పుడు లాడ్జిల్లో బస చేసేవారు. అయితే తమ సహజీవనానికి స్వస్తి పలికి సహచరుడు పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి మరో యువకుడు క్షణికావేశానికి లోపై అతడి ప్రాణాలు తీశాడు. దీంతో రెండేళ్ల పాటు కొనసాగిన సహజీవనం కాస్తా విషాదం మారింది. రెండ్రోజుల క్రితం ఎస్సార్నగర్లోని క్రిష్ ఇన్ లాడ్జ్లో జరిగిన యువకుడి హత్యకేసును పోలీసులు చేధించారు.
ఎస్సార్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కొండా శ్రీకాంత్రెడ్డికి, మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముసల్పూర్ గ్రామానికి చెందిన డప్పి నరేష్కు ఫేస్బుక్లో పరిచయమైంది. కొద్దిరోజుల తర్వాత వీరిద్దరూ హైదరాబాద్లోని లాడ్జిలో కలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ స్వలింగ సంపర్కానికి అలవాటుపడి ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నారు. కొంతకాలం తర్వాత శ్రీకాంత్ ఉన్నత చదువుల కోసం దుబాయ్ వెళ్లి అక్కడే మంచి ఉద్యోగంలో చేరాడు. కుమారుడు ప్రయోజకుడు కావడంతో అతడి తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చి జూన్ 19న నిశ్చితార్థం చేశారు.
తాను దుబాయ్కి వెళ్తున్నానని ఈ నెల 3వ తేదీన ఇంటికి నుంచి బయలుదేరిన శ్రీకాంత్.. హైదరాబాద్లో నరేష్ను కలిశాడు. వీరిద్దరూ ఎస్సార్నగర్లోని క్రిష్ ఇన్ లాడ్జిలో రూమ్ తీసుకుని గడిపారు. ఈ క్రమంలోనే తనకు పెళ్లి కుదిరిందని, ఇక ఇద్దరి మధ్య సంబంధానికి ఫుల్స్టాప్ పెట్టేద్దామని శ్రీకాంత్ అనడంతో నరేష్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నరేష్ క్షణికావేశంలో కత్తితో శ్రీకాంత్ గొంతు కోసేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో అతడు రూమ్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆందోళన చెందిన నరేష్ తాను కూడా గొంతుకోసుకున్నాడు.
4వ తేదీన వీరు రూమ్ ఖాళీ చేయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపుకొట్టగా తీయలేదు. మాస్టర్ కీ సాయంతో తలుపులు తెరవగా శ్రీకాంత్రెడ్డి, నరేష్ రక్తపు మడుగులో పడివున్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నరేష్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీకాంత్రెడ్డి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. శ్రీకాంత్కు పెళ్లయితే తమ బంధం ముగుస్తుందన్న ఆందోళనతోనే నరేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఎస్సార్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కొండా శ్రీకాంత్రెడ్డికి, మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముసల్పూర్ గ్రామానికి చెందిన డప్పి నరేష్కు ఫేస్బుక్లో పరిచయమైంది. కొద్దిరోజుల తర్వాత వీరిద్దరూ హైదరాబాద్లోని లాడ్జిలో కలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ స్వలింగ సంపర్కానికి అలవాటుపడి ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నారు. కొంతకాలం తర్వాత శ్రీకాంత్ ఉన్నత చదువుల కోసం దుబాయ్ వెళ్లి అక్కడే మంచి ఉద్యోగంలో చేరాడు. కుమారుడు ప్రయోజకుడు కావడంతో అతడి తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చి జూన్ 19న నిశ్చితార్థం చేశారు.
తాను దుబాయ్కి వెళ్తున్నానని ఈ నెల 3వ తేదీన ఇంటికి నుంచి బయలుదేరిన శ్రీకాంత్.. హైదరాబాద్లో నరేష్ను కలిశాడు. వీరిద్దరూ ఎస్సార్నగర్లోని క్రిష్ ఇన్ లాడ్జిలో రూమ్ తీసుకుని గడిపారు. ఈ క్రమంలోనే తనకు పెళ్లి కుదిరిందని, ఇక ఇద్దరి మధ్య సంబంధానికి ఫుల్స్టాప్ పెట్టేద్దామని శ్రీకాంత్ అనడంతో నరేష్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నరేష్ క్షణికావేశంలో కత్తితో శ్రీకాంత్ గొంతు కోసేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో అతడు రూమ్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఆందోళన చెందిన నరేష్ తాను కూడా గొంతుకోసుకున్నాడు.
4వ తేదీన వీరు రూమ్ ఖాళీ చేయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపుకొట్టగా తీయలేదు. మాస్టర్ కీ సాయంతో తలుపులు తెరవగా శ్రీకాంత్రెడ్డి, నరేష్ రక్తపు మడుగులో పడివున్నారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నరేష్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీకాంత్రెడ్డి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. శ్రీకాంత్కు పెళ్లయితే తమ బంధం ముగుస్తుందన్న ఆందోళనతోనే నరేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.