బాబాల ముసుగులో వెకిలి చేష్టలు.. వారణాసిలో జర్మన్ మహిళపై లైంగిక వేధింపులు
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో జర్మన్ మహిళ లైంగిక వేధింపులకు గురైింది. రాత్రివేళ ఆశ్రమంలో నిద్రిస్తున్న ఆమెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Samayam Telugu 31 Jul 2019, 2:57 pm
ప్రధానాంశాలు:
- వారణాసిలో దారుణం
- ఆశ్రమంలో జర్మన్ మహిళపై లైంగిక వేధింపులు
- నిందితుల్లో ఇద్దరు బాబాలు
ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు వారణాసి వచ్చిన జర్మన్ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె బస చేస్తున్న ఆశ్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి యత్నించారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు శివ్పూర్ పోలీస్స్టేషన్కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. జర్మన్కు చెందిన ఓ మహిళ(32) రెండు నెలలుగా వారణాసిలో నివసిస్తోంది. రెండ్రోజుల క్రితం ఆమె ధర్మశాల ఆశ్రమానికి వెళ్లి బస చేసింది. అక్కడ రాత్రివేళ నిద్రపోతున్న సమయంలో ఆమె రూమ్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి లైంగికంగా వేధించారు. పవిత్రమైన ఆశ్రమంలో నీచపు పనులేంటి అని నిలదీసిగా వారు వినిపించుకోలేవు. ఆమె రహస్య భాగాల్లో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె వారి బారి నుంచి తప్పించుకుంది. వెంటనే పోలీసులకు జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు ఆశ్రమానికి చేరుకుని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు బాబాలు ఉన్నారని బాధితురాలు చెబుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దీంతో పోలీసులు ఆశ్రమానికి చేరుకుని ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు బాబాలు ఉన్నారని బాధితురాలు చెబుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.