యాప్నగరం

మరో యువతితో ప్రియుడి నిశ్చితార్థం.. మనస్తాపంతో గ్రామ వాలంటీర్‌ ఆత్మహత్య

నాలుగేళ్లుగా ప్రేమించిన యువకుడు మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో మనస్తాపానికి గురైన వాలంటీర్ రమా భార్గవి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Samayam Telugu 17 Feb 2020, 2:02 pm
ప్రేమ విఫలమై మహిళా వలంటీర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. గుత్తి మున్సిపాలిటీలోని చెట్నేపల్లి ఒకటో బ్లాక్‌ వార్డులో వాలంటీర్‌గా పనిచేస్తున్న రమా భార్గవి(23) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Samayam Telugu images


Also Read: అర్ధరాత్రి వివాహితపై ప్రియుడి అఘాయిత్యం.. పోలీసులకు పట్టించిన 11 ఏళ్ల కొడుకు

రమా భార్గవి అదే గ్రామానికి చెందిన బైక్‌ మెకానిక్‌ ఇమామ్‌ హుస్సేన్‌‌ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని షికార్లుకు తిరిగేవారు. ఈ క్రమంలోనే 10 రోజుల క్రితం హుస్సేన్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి భార్గవి మనస్తాపానికి గురైంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోతున్నానని మదనపడింది. దీంతో ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగేసింది.

Also Read: ప్రేమించి పెళ్లాడిన నాలుగు నెలలకే యువతి ఆత్మహత్య.. భర్తపై అనుమానం

కాసేపటి తర్వాత ఆమెను గమనించిన కుటుంబసభ్యులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. భార్గవి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టారు.

Also Read: కరీంనగర్‌లో విషాదం.. బైక్ కాల్వలోకి దూసుకెళ్లి భార్య మృతి.. ఆస్పత్రిలో భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.