యాప్నగరం

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న టీచర్.. ఆత్మహత్య.. విశాఖలో మిస్టరీగా మరణం

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఆమె ఒక్కరే ఉంటున్నారు. భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎందుకు ఆత్మహత్య..?

Samayam Telugu 13 Aug 2020, 3:53 pm
భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. పాడేరు డివిజన్‌లోని హుకుంపేట మండలం శోభకోట గ్రామానికి చెందిన కామేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొయ్యూరు మండలం చిట్టింపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నం అయ్యన్నకాలనీలో నివాసముంటున్న కామేశ్వరి రోజూ స్కూల్‌కి వెళ్లి వస్తుంటారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


ఆమెకు గతంలో వివాహం కాగా భర్తతో విభేదాల కారణంగా విడిపోయినట్లు తెలుస్తోంది. కొద్దికాలం కిందట విడాకులు కూడా తీసుకున్నారు. అయ్యన్నకాలనీలోని ఇంట్లో సడెన్‌గా శవమై కనిపించారు. ఫ్యాన్‌కి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పలుమార్లు ఫోన్ చేసినా కామేశ్వరి ఫోన్ తీయకపోవడంతో ఆమె సోదరుడికి అనుమానం వచ్చి తోటి ఉపాధ్యాయులకు సమాచారం అందించాడు. ఉపాధ్యాయులు ఆమె ఇంటికి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది.

Also Read: బ్యాంక్ మేనేజర్‌‌కి భార్యని ఎరవేసి.. లోన్ ఇవ్వలేదని భర్త నీచం.. చివరికి..

సమాచారం అందుకున్న నర్సీపట్నం పట్టణ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఒంటరిగా ఉంటున్న ఉపాధ్యాయురాలి ఆత్మహత్య మిస్టరీగా మారింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: కన్నతండ్రి కామవాంఛలు తీర్చలేక.! తండ్రిని కూతుళ్లు చంపేసిన కేసులో షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.