యాప్నగరం

పెళ్లికొడుకు ఆత్మహత్య.. వివాహం వాయిదా పడిందని.. కర్నూలులో విషాదం

కరోనా మహమ్మారి కారణంగా వివాహం వాయిదా పడింది. అయితే ఆ విషయాన్ని పెళ్లికొడుకు జీర్ణించుకోలేకపోయాడు. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.

Samayam Telugu 26 Apr 2020, 4:51 pm
కరోనా రూపంలో పెళ్లికి ఆటంకం రావడంతో తట్టుకోలేకపోయిన పెళ్లికొడుకు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. వివాహం వాయిదా పడిందని తెలియడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పట్టణంలోని ఎద్దుల మార్కెట్ ప్రాంతానికి చెందిన నాగరాజు(20) అనే యువకుడికి ఇటీవల పెద్దలు వివాహం నిశ్చయించారు. త్వరలోనే పెళ్లి చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈలోగా కరోనా విజృంభించడంతో పెళ్లిళ్లు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: యువతి శవాన్ని కుక్కలు పీక్కుతిని.. దొరకని ఆనవాళ్లు.. తాడేపల్లిగూడెంలో ఘోరం

గత్యంతరం లేని పరిస్థితుల్లో నాగరాజు వివాహం వాయిదా పడింది. పెళ్లి వాయిదా పడిందని తెలిసి మనస్థాపానికి గురైన పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మిగనూరు రూరల్ మండలంలోని గుడికల్లు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని దారుణంగా చంపి మృతదేహాన్ని..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.