యాప్నగరం

తాళి కట్టిన మూడోరోజే వరుడి పరార్.. ప్రేమ వ్యవహారంపై అనుమానాలు

ఆదివారం వారిద్దరికి వివాహమైంది. బుధవారం వధువు ఇంట్లోని కార్యక్రమానికి వరుడు హాజరు కావాల్సింది. ఈ క్రమంలోనే ఉదయం అతడు ఇంటి నుంచి పరారయ్యాడు.

Samayam Telugu 28 May 2020, 8:20 am
పెళ్లయిన మూడో రోజునే వరుడు అదృశ్యమైన ఘటన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో వెలుగుచూసింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి పాములపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఈనెల 24న వివాహం జరిగింది. వరకట్నంగా రూ.15 లక్షలు ఇచ్చారు. రెండు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఆల్వకొండకు వెళ్లే మార్గంలో ఉన్న ఓ ఆశ్రమంలో పెళ్లి నిరాడంబరంగా జరిపించారు.
Samayam Telugu Image


Also Read: ఉద్యోగం కోసం వెళ్తే వ్యభిచారం చేయాలంటూ.. ‘అనంత’ యువతికి చేదు అనుభవం

అయితే పెళ్లి అనంతరం మూడోరోజు బుధవారం వధువు ఇంట్లో జరగాల్సిన కార్యక్రమానికి వరుడు వెళ్లాల్సి ఉంది. అయితే అతడు ఉదయం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వరుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువుల చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో వరుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనకు ప్రేమ వ్యవహారమా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పోలీస్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. మద్యం తరలిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.