యాప్నగరం

గుంటూరులో మహిళ కిరాతకం.. ఇద్దరితో అఫైర్ పెట్టుకుని కన్నబిడ్డలకు చిత్రహింసలు

తండ్రి చనిపోయాక తల్లి ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుని తమను వేధిస్తోందని ఇద్దరు పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె నుంచి ప్రాణహాని ఉందని, రక్షించాలని వేడుకున్నారు.

Samayam Telugu 28 Jan 2020, 5:02 pm
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోయిన తర్వాత కన్నకొడుకులను పట్టించుకోకుండా ఓ మహిళ ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతటితో ఆగకుండా ప్రియుళ్లతో కలిసి 11, 13 సంవత్సరాల వయసున్న బాలురను వేధింపులకు గురిచేస్తోంది. కన్నతల్లే కష్టపెడుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధితులు చివరికి స్పందన కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu guntur childrens complains to police againt their mother over her harassment
గుంటూరులో మహిళ కిరాతకం.. ఇద్దరితో అఫైర్ పెట్టుకుని కన్నబిడ్డలకు చిత్రహింసలు



అత్త, భర్త మృతితో బరితెగింపు

పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. 2014లో నాయనమ్మ చనిపోగా.. 2015లో తండ్రి కూడా అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి, నాయనమ్మ బతికున్నంత వరకు తల్లి ఇద్దరు కొడుకులను బాగానే చూసుకునేది. కానీ తర్వాతే వారిద్దరికి నరకం మొదలైంది.

ఒక్కరు కాదు.. ఇద్దరితో అఫైర్

తల్లి షేక్‌ రహీం అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఒక్కడితో చాలక రహీం ఫ్రెండ్ ప్రమోద్‌తోనూ అఫైర్ పెట్టుకుంది. ఇద్దరూ ఎక్కువ సమయం ఆమె ఇంట్లోనే ఉంటూ రాసలీలలు కొనసాగించేవారు. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలను తీవ్రంగా హింసించేవారు. పిల్లలను బయటికి పంపిస్తే తన బంఢారం ఎక్కడ బయట పడుతుందోనన్న ఉద్దేశంతో ఆ మహిళ వారిని ఏడాదిగా స్కూల్‌కి పంపడం లేదు.

ప్రియుడితో గొడవపడి పిల్లలకు చిత్రహింసలు

ఈ నెల 24న ఆమెకు, ప్రమోద్‌కు గొడవ జరిగింది. దీంతో మీ వల్లే నా ప్రియుడితో గొడవ జరిగిందంటూ ఆ తల్లి పిల్లలను చావబాదింది. దీంతో ఇద్దరు బాలురు ఇంటి నుంచి బయటకు వచ్చి తెలిసిన వారి వద్ద రూ.100 తీసుకుని అమ్మమ్మ దగ్గరకు చేరారు. ఆమె సాయంతో సోమవారం గుంటూరు పోలీస్ కార్యాలయానికి వచ్చి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

తల్లిపై కంప్లైంట్‌ ఇచ్చిన పిల్లలు

‘తమను చిత్ర హింసలు పెట్టడంతో పాటు చదివించకుండా, తిండి పెట్టకుండా వెట్టిచాకిరి చేయించిన తల్లిపైనా, ఆమె ప్రియులైన రహీం, ప్రమోద్‌లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. వారి నుంచి మాకు ప్రాణ రక్షణ కల్పించాలి’ అని ఆ ఇద్దరు చిన్నారులు పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.