యాప్నగరం

లారీ క్యాబిన్‌కి ఉరి వేసుకున్న డ్రైవర్.. గుంటూరులో విషాదం

డ్యూటీకి వెళ్లిన డ్రైవర్ తాను నడిపే లారీకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Samayam Telugu 21 May 2020, 12:50 pm
తను నడిపే లారీకే ఉరివేసుకుని డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. ఆర్థిక ఇబ్భందుల కారణంగా లారీని రోడ్డు పక్కన నిలిపి ఉంచి క్యాబిన్‌కి తాడుతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన షేక్ సుభాని(40) లారీ డ్రైవర్. నాలుగు రోజుల కిందట విధుల్లో భాగంగా కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం వెళ్లాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


లక్ష్మీపురం సమీపంలోని ఓ పెట్రోల్ బంకు ఎదుట లారీని నిలిపి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రోడ్డు పక్కన లారీని ఆపి క్యాబిన్‌కి తాడుతో ఉరేసుకున్నాడు. లారీకి వేలాడుతూ కనిపించిన సుభానీని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి పంపారు.

Also Read: మేనల్లుడితో అత్త రాసలీలలు.. ఫలితంగా బిడ్డ.. మామకి తెలిసిపోవడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.