యాప్నగరం

బాలికపై అత్యాచారం చేసి.. 20 రూపాయలు చేతిలో పెట్టాడు.. గుంటూరులో దారుణం

తన స్నేహితురాలితో ఆడుకుంటున్న 11 సంవత్సరాల బాలికను ఫోన్ చూపిస్తానని ఆశచూపి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లాడు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

Samayam Telugu 22 Jan 2020, 5:51 pm
మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన మానవమృగాన్ని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పదకొండేళ్ల బాలికను రేప్ చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
Samayam Telugu child rape3


పోలీసుల తెలిపిన కథనం మేరకు వివరాలు.. మంగళగిరి పట్టణ పరిధిలోని బాపనయ్య నగర్ ఒకటో లైన్‌‌కు చెందిన షేక్ బాజి (55) ఈ నెల 19 వ తేదీ పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితురాలితో ఆడుకుంటున్న 11 సంవత్సరాల బాలికను ఫోన్ చూపిస్తానని ఆశచూపి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లాడు. బాలికపై అత్యాచారం అనంతరం బాలికకు రూ.20 ఇచ్చి కొనుక్కోమని పంపించాడు.

Also Read: సెక్స్ బానిసలుగా మారిన జంట.. స్కూల్ డ్రెస్‌ చూస్తే వెర్రి.. చివరికి..

బాలిక నొప్పి భరించలేక ఏడుస్తూ బయటకు వచ్చి తన స్నేహితురాలి తల్లికి.. తన తల్లికి జరిగిన దారుణం గురించి చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై అత్యాచారంతోపాటు పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Read Also: కళ్లలో కారం కొట్టినా వదలని మహిళ.. చిన్న ముక్కతోనే చైన్ స్నాచర్ పరారీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.