యాప్నగరం

బాలికలకు ఆ వీడియోలు చూపిస్తూ లైంగిక వేధింపులు.. గుంటూరులో కీచక టీచర్

ఐదో తరగతి చదువుతున్న బాలికలకు పోర్న్ వీడియోలు చూపిస్తున్న ప్రధానోపాధ్యాయుడు వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు

Samayam Telugu 25 Feb 2020, 11:52 am
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారిపోయాడు. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలికలు ఇంట్లో చెప్పలేక..అటు పాఠశాలకు వెళ్లలేక సతమతమవుతున్నారు. చివరికి తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. గుంటూరు జిల్లాలో వెలుగుచూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి.
Samayam Telugu girl rape


Also Read: లేడీస్ హాస్టల్‌లో దూరిన యువకుడు.. ప్రియురాలితో రాత్రంతా... ఈసారి తెలంగాణలో

రాజుపాలెం మండలం ఆకులగణపవరంలోని మండల పరిషత్‌ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు ఐదో తరగతి చదివే విద్యార్థినుల పట్ల కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారికి సెల్‌ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించడం, బాలికల శరీరంపై తాకడం, అసభ్యంగా మాట్లాడటం చేస్తున్నాడు. అతడి వికృత చేష్టలకు బాలికలు స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

Also Read: టిక్‌టాక్‌లో హాట్‌హాట్ వీడియోలు, యువకులతో బూతుపురాణం.. అమర సైనికుడి భార్యను ఛీకొడుతున్న గ్రామస్థులు

ఇటీవల ఓ బాలిక పాఠశాలకు వెళ్లకుండా కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండటంతో తల్లిదండ్రులు ప్రశ్నించినా నోరు మెదపలేదు. చివరికి తల్లి దగ్గరికి తీసుకుని ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. ఈ విషయం స్థానికంగా ప్రచారం కావడంతో ఆ స్కూల్‌లో చదివే బాలికల తల్లిదండ్రులు తమ కుమార్తెలను ఆరా తీశారు. అందరూ ఆ ఉపాధ్యాయులు చేసే చేష్టలను వివరించడంతో అందరూ కలిసి సోమవారం స్కూల్‌కి వెళ్లి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు.

Also Read: గుంటూరులో కీచక మామ... కోరిక తీర్చాలంటూ కోడలికి వేధింపులు

అయితే ఈ వ్యవహారంలో పోలీసులు నిందితుడికి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తల్లిదండ్రులు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సమయంలో నిందితుడి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు అక్కడికి వచ్చారు. బాలిక తల్లిదండ్రులు వెనుకబడిన వర్గానికి చెందిన వారు కావడంతో వారిపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీ కుదిర్చి ఫిర్యాదు చేయకుండానే వెనక్కి పంపారు. కొందరు ఈ విషయాన్ని డీఈవో గంగాభవానికి చేరవేయగా ఆమె విచారణ చేపట్టారు. నిందితుడిపై ఆరోపణలు నిజమేనని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Also Read: వీడిన కాకినాడ మర్డర్ మిస్టరీ.. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.