ఈరోజు వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. జీవిత భాగస్వాములను మోసం చేస్తూ కొందరు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వారితో సుఖానికి అడ్డుగా ఉన్నారని భావిస్తే హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అయితే ఈ బంధాలు సాఫీగా కొనసాగినంతకాలం బాగానే ఉంటుంది గానీ.. తేడా వచ్చిందంటే ప్రాణాలే పోతాయి. ఇలాగే హర్యానాకు చెందిన ఓ వివాహిత ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరు ప్రియులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఓ లాడ్జికి వెళ్లి వారి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది.
Also Read: ఖమ్మంలో రెచ్చిపోయిన రౌడీషీటర్.. యువతిపై కత్తితో దాడి, చావుబతుకుల్లో వృద్ధురాలు
గురుగ్రామ్కు చెందిన సునయన అనే మహిళకు ఓ వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు తొమ్మిదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఇటీవల ఆమె ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో వారితో ఇంట్లోనే ఎంజాయ్ చేసేది. సోమవారం రాత్రి ఇద్దరు ప్రియులతో కలిసి సునయన గురుగ్రామ్ సెక్టార్ 47లోని ఓయో హోటల్కు వెళ్లి రూమ్ నంబర్ 403 అద్దెకు తీసుకుంది. మంగళవారం 9 గంటలకు చెక్ అవుట్ కావాల్సి ఉన్నా తలుపులు తీయలేదు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది ఎంత పిలిచినా డోర్ తీయలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: స్వదేశీ కావాలా? విదేశీ కావాలా?.. విటులకు బంపరాఫర్లు ఇస్తున్న వ్యభిచార నిర్వాహకులు
కాసేపటికి హోటల్కు చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా సునయన విగతజీవిగా కనిపించింది. ఆమె వెంట వచ్చిన ఇద్దరు యువకులు కనిపించకపోవడంతో వారే ఆమెను చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భార్యను పథకం ప్రకారమే హత్య చేసి ఉండొచ్చని సునయన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు.
Also Read: భర్తపై విరక్తితో స్నేహితుడితో పరార్.. వీడిన తెలుగు వైద్యుల మిస్సింగ్ మిస్టరీ
Also Read: ఖమ్మంలో రెచ్చిపోయిన రౌడీషీటర్.. యువతిపై కత్తితో దాడి, చావుబతుకుల్లో వృద్ధురాలు
గురుగ్రామ్కు చెందిన సునయన అనే మహిళకు ఓ వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు తొమ్మిదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఇటీవల ఆమె ఇద్దరు యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో వారితో ఇంట్లోనే ఎంజాయ్ చేసేది. సోమవారం రాత్రి ఇద్దరు ప్రియులతో కలిసి సునయన గురుగ్రామ్ సెక్టార్ 47లోని ఓయో హోటల్కు వెళ్లి రూమ్ నంబర్ 403 అద్దెకు తీసుకుంది. మంగళవారం 9 గంటలకు చెక్ అవుట్ కావాల్సి ఉన్నా తలుపులు తీయలేదు. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది ఎంత పిలిచినా డోర్ తీయలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: స్వదేశీ కావాలా? విదేశీ కావాలా?.. విటులకు బంపరాఫర్లు ఇస్తున్న వ్యభిచార నిర్వాహకులు
కాసేపటికి హోటల్కు చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా సునయన విగతజీవిగా కనిపించింది. ఆమె వెంట వచ్చిన ఇద్దరు యువకులు కనిపించకపోవడంతో వారే ఆమెను చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భార్యను పథకం ప్రకారమే హత్య చేసి ఉండొచ్చని సునయన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు.
Also Read: భర్తపై విరక్తితో స్నేహితుడితో పరార్.. వీడిన తెలుగు వైద్యుల మిస్సింగ్ మిస్టరీ