యాప్నగరం

బాలికలపై ముగ్గురు మేనమామల రేప్.. తల్లిదండ్రుల ఆమోదంతోనే!

తల్లిదండ్రుల ఆమోదంతో మైనర్ బాలికలపై సొంత ముగ్గురు మేనమామలే సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ పట్టణానికి చెందిన ఓ యువతి (21) ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 21 Dec 2019, 4:06 pm
మైనర్ బాలికలపై సొంత ముగ్గురు మేనమామలే సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలికల తల్లిదండ్రుల ఆమోదంతోనే ఈ రాక్షసకాండ సాగుతోంది. తాను సంవత్సరాల పాటు పడిన ఈ నరకయాతనను ప్రస్తుతం మైనర్లయిన తన చెల్లెళ్లకు కూడా చూపిస్తుండటంతో తట్టుకోలేక ఓ యువతి ఈ దుర్మార్గాన్ని బయటపెట్టింది.
Samayam Telugu eve-teasing


Also Read: అత్తను రేప్ చేసిన అల్లుడు.. అవమానంతో ఆత్మహత్య

తన తల్లిదండ్రుల ఆమోదంతో ముగ్గురు మేనమామలు తనపై సంవత్సాల పాటు అత్యాచారం చేశారని హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ పట్టణానికి చెందిన ఓ యువతి (21) పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తాను మైనర్‌గా ఉన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల ఆమోదంతోనే మేనమామలు ఏళ్ల తరబడిగా అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు 18 ఏళ్ల వయసు వచ్చాక 2017 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకొని భర్తతో వెళ్లిపోయినట్లు పేర్కొంది.

Also Read: నా భార్య నీకు.. నీ భార్య నాకు..! ఓ నీచుడి దుశ్చర్య

తాను పెళ్లి అయి వెళ్లి పోవడంతో తన స్థానంలో తన మైనర్ చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదంతా తమ తల్లిదండ్రుల అనుమతితో జరుగుతోందని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తన చెల్లికి భయపడుతోందని, అందుకే ముందుకు రావట్లేదని బాధితురాలు పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులతో పాటు ఏడుగురిపై ఐపీసీ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతను మహిళా ఏఎస్ఐ కమలాదేవీకి అప్పగించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని కమలాదేవి చెప్పారు.

Also Read: ఐసీయూలోని 206 మంది మహిళలను రేప్ చేసి.. వీడియోలు తీసి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.