యాప్నగరం

గుంటూరులో విషాదం.. కరోనా స్పెషల్ డ్యూటీకి వెళ్తూ హోంగార్డు మృతి

డ్యూటీ కోసం వెళ్తున్న హోంగార్డులు ప్రమాదానికి గురయ్యారు. నారాయణస్వామిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 8 Apr 2020, 2:21 pm
లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ బోర్డర్ వద్ద విధులు నిర్వర్తించేందుకు వెళ్తూ గార్డు దుర్మరణం చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొనడంతో తీవ్రగాయాలపాలైన హోంగార్డును మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. ఈ విషాద ఘటన గుంటూరులో జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu dead-body


కరోనా నేపథ్యంలో పిట్టలవానిపాలెం మండలానికి చెందిన శ్రీనివాసరావు, నారాయణస్వామి అనే ఇద్దరు హోంగార్డులకు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల బోర్డర్ పోలీస్ చెక్‌పోస్టు వద్ద డ్యూటీలు వేశారు. విధులకు హాజరయ్యేందుకు వారిద్దరూ బైక్‌పై వస్తుండగా కుక్క అడ్డురావడంతో తప్పించబోయి ప్రమాదవశాత్తూ రోడ్డుపక్కనే ఉన్న సిమెంటు దిమ్మెను ఢీకొట్టారు. దీంతో ఇద్దరూ బైక్‌పై నుంచి కిందపడిపోయి తీవ్రగాయాలపాలయ్యారు.

Also Read: కలచివేస్తున్న గర్భిణి మరణం.. లాక్‌డౌన్‌లో రక్తం దొరక్క..

చెక్‌పోస్టుకు సమీపంలోని శ్రీనగర్-పొందుగుల గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసుల వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హోంగార్డు నారాయణస్వామిని గుంటూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడు. మరికొద్దిసేపట్లో చెక్‌పోస్టుకు చేరుకుంటారనేలోపు ప్రమాదంలో హోంగార్డు మృత్యువాతపడడం తీవ్ర విషాదం నింపింది.

Read Also: కామపిశాచిగా మారిన కన్నతండ్రి.. కూతురిపై నెల రోజులుగా దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.