యాప్నగరం

Guntur: జింకను చంపిన వేటగాడు.. బైక్‌పై తెస్తూ బుక్కయ్యాడు!

రెండు రాష్ట్రాల సరిహద్దులోని గోవిందాపురం వద్ద మాచవరం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా వేటగాడు దొరికిపోయాడు. వేటాడిన జింకను బైక్‌పై పెట్టుకుని వస్తూ పట్టుబడ్డాడు.

Samayam Telugu 17 Sep 2020, 2:31 pm
అటవీ జంతువులను చంపకూడదని చట్టాలు చెబుతున్నా కొందరు కసాయిలు కనీస కనికరం చూపడం లేదు. వన్యప్రాణులను ఆటవికంగా చంపి మాంసం విక్రయాలు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో జింకను వేటాడి బైక్‌పై పెట్టుకుని వస్తున్న వేటగాడు పోలీసులకు బుక్కయ్యాడు. అదే సమయంలో మాచవరం పోలీసులు మండలంలోని గోవిందాపురం వద్ద వాహన తనిఖీలు చేస్తుండడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బైక్‌పై జింకతో సహా అడ్డంగా దొరికిపోవడంతో వెంటనే స్థానిక పోలీసులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. జింక మృతదేహాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేటగాడిని అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu వేటగాడు చంపేసిన జింక
hunting


Read Also: Ongole: కూతురి ఓణీల ఫంక్షన్.. చదివింపుల డబ్బుల కోసం తండ్రి దారుణం

Also Read:
కొంపముంచిన కూతురి స్మార్ట్‌ఫోన్.. హైదరాబాద్‌‌లో షాకింగ్ ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.