యాప్నగరం

కట్నం కోసం భార్యపై కత్తులతో దాడి.. ఏఎస్సై కుమారుడి ఘాతుకం

కట్నం కోసం కట్టుకున్న భార్యపై భర్త, కుటుంబ సభ్యులు కత్తులతో దాడికి దిగిన దారుణ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

Samayam Telugu 23 Jan 2020, 4:04 pm
ఏఎస్సై కుమారుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. అదనపు కట్నం తేవాలంటూ భార్యను నిత్యం వేధింపులకు గురిచేశాడు. కొద్దికాలం మౌనంగా భరించిన భార్య.. వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆగ్రహం చెందిన భర్త.. కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిపై కత్తులతో దాడికి దిగాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
Samayam Telugu attack


జిల్లాలోని ఐరాల మండలం సంతగేటుకు చెందిన రోజాకు, పెద్దకాల్వకు చెందిన పవన్‌కుమార్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొద్దికాలంగా భర్త, అత్తమామాలు కట్నం కోసం రోజాను వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఆమె.. భర్త పవన్‌కుమార్, మామ జ్ఙానప్రకాష్‌ (ఏఎస్‌ఐ), అత్త భానుమతి తరచూ వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: మనవరాలిని చంపేసిన తాతయ్య, నానమ్మ.. విజయవాడలో దారుణం

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న భర్త కుటుంబ సభ్యులు ఆమెపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. కట్నం కోసం వేధిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు మూడు రోజులుగా భార్య, భర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దాడి ఘటనపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also: కొడుకును చంపేస్తూ జోలపాట.. ముగ్గురు బిడ్డలను రాక్షసంగా హతమార్చిన తల్లి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.