యాప్నగరం

భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు. మొండం నుంచి తలను వేరు చేసి.. దాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Samayam Telugu 18 Jun 2019, 8:54 pm

ప్రధానాంశాలు:

  • చిత్తూరు జిల్లా కదిరాయచెరువులో ఘటన
  • భయబ్రాంతులకు గురైన స్థానికులు
  • నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu af
భార్యపై అనుమానంతో.. కిరాతకంగా నరికి చంపాడో భర్త. ఆమె తల-మొండాన్ని వేరు చేసి.. తలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుడు తలతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళుతుంటే.. స్థానికులు చూసి భయబ్రాంతులకు గురయ్యారు. చిత్తూరు జిల్లా కలకడ మండలం కదిరాయచెరువులో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలంరేపింది.
కదిరాయచెరువుకు చెందిన హుస్సేన్ తన భార్య అమ్మాజీపై అనుమానం పెంచుకున్నాడు. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. కొద్దిరోజులుగా ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో మళ్లీ గొడవకు దిగిన హుస్సేన్.. భార్యను దారుణంగా నరికి చంపాడు. తలను తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.